లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆదివారం మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మోడీ ప్రమాణస్వీకారం తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీలో చేయన్నారు. G7 సమ్మిట్లో పాల్గొనేందుకు ఇటీవల ప్రధాని జార్జియా మెలోని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ సమ్మిట్ తర్వాత స్విట్జర్లాండ్లో జూన్ 15-16 వరకు జరిగే ‘‘ ఉక్రెయిన్లో శాంతి శిఖరాగ్ర సదస్సు’’ లో పాల్గొననున్నట్లు సమాచారం.