మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.