తెలంగాణ డీజీపీ రవి గుప్తాను బీఆర్ఎస్ నేతలు, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కలిశారు. ఇటీవల దారుణ హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి న్యాయం చేయాలని డీజీపీని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు మంత్రి జూపల్లి ఇంట్లోనే ఉన్నాడని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.