బైక్ ల చోరీకి పాల్పడుతున్న యువకుడు అరెస్ట్: మెదక్ ఎస్పీ

51பார்த்தது
జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. శివంపేట మండలంలో బైకులు చోరీకి పాల్పడుతున్న జర్పుల మోహన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతని నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ ను శనివారం రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி