నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు వినతి

74பார்த்தது
నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు వినతి
జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గోండుగూడా, ఎస్సీ కాలనీ కలిపి దాదాపు 600 జనాభా ఉంటుందని, నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీడీవో శశికళకు వినతి పత్రం సమర్పించారు. ఆ రెండు గూడాలు గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, అభివృద్ధి కొరకు నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி