తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా శ్రీరాంపూర్ లోని హిమ్మత్ నగర్ సెంటర్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దాసు తెలిపారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్, కార్యదర్శి లక్ష్మణ్ హాజరవుతారని పేర్కొన్నారు. సభలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.