ప్రమాదకర స్థాయికి పాలకొండ అలుగు

64பார்த்தது
మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాలకొండ చెరువు గరిష్ట నీటిమట్టానికి చేరుకుని అలుగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఆదివారం అలుగును చూసేందుకు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరూ కూడా చెరువు అలుగు ప్రాంతానికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా కూడా ప్రజలు అలాగే వెళుతున్నారు. ప్రజలు అక్కడికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி