తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిజ్నోర్లోని నజీబాబాద్ హైవేపై ఉన్న జాత్పురా గ్రామం వద్ద మద్యం లారీ అదుపుతప్పి వేప చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ట్రక్కులో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై పగిలిపోయాయి. దీంతో గమనించిన బాటసారులు మద్యం సీసాలు తీసుకుని పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.