ముంబైలోని ట్విన్ టన్నెల్ నుంచి నీరు లీక్ అవుతోంది. అరేబియా సముద్రం అంతర్భాగంలో సముద్ర మట్టానికి 17 నుంచి 20 మీటర్ల లోతులో ఈ టన్నెల్ను నిర్మించారు. దానిని ప్రారంభించి రెండు నెలలు అయ్యింది. ఆదివారం లీకేజీ వీడియోలు బయటకు రావడంతో సీఎం ఏక్నాథ్షిండే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు, మూడు చోట్ల లీకేజీలు ఉన్నాయని, ఒరిజినల్ స్ట్రక్చర్కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.