నేటి ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి తుమ్మల రాక

61பார்த்தது
నేటి ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి తుమ్మల రాక
కొత్తగూడెం ప్రకాశం మైదానంలో మంగళవారం నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సోమవారం తెలిపారు. తొలుత మంత్రి అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారని చెప్పారు. అనంతరం ప్రకాశం మైదానంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ప్రదర్శనను తిలకిస్తారని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி