అదుపుతప్పి బోల్తా పడ్డ కారు.. పలువురికి గాయాలు

75பார்த்தது
అశ్వారావుపేట మండలం ఆసుపాక జామాయిల్ యార్డు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி