స్మశాన వాటికకు రోడ్డు వేయించండి

59பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో బుధవారం పెంబుల హుస్సేన్ మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో స్మశాన వాటికకు వెళుతుండగా రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో పక్కనే ఉన్న వరి పొలంలో నుంచి శవాన్ని తీసుకొని పోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా స్మశాన వాటికకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி