పదిహేను రోజులుగా పేరుకుపోయిన చెత్తచెదారంతో జనం పరేషాన్

57பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణం మున్సిపల్ వార్డ్ నెంబర్ 20 లో గత పదిహేను రోజులుగా పారిశుద్ధ్య పనులు కొనసాగక కాలనీలలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో వార్డులలో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది తాము రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి పారిశుద్ధ్య పనులు చేసి చెత్తచెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி