కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన విశ్వనాథ్ గురువారం ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యను మర్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం డిపో ఆవరణలో. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని డీఎస్పీ అన్నారు. వీరి వేంట ఏఎంఎఫ్ ఉదయ్ ఉన్నారు.