టీ20 వరల్డ్ కప్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్తో జరగబోయే వామప్ మ్యాచ్కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వీసా అపాయింట్మెంట్, ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆర్సీబీ నిష్క్రమణ వంటి కారణాలతో కోహ్లీ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండరని సమాచారం. ఇప్పటికే టీమిండియా ఫస్ట్ బ్యాచ్లో రోహిత్, బుమ్రా, సూర్య, కుల్దీప్, అర్ష్దీప్ తదితర క్రికెటర్లు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.