చిన్నారులకు పోషకాహారం తప్పనిసరి

60பார்த்தது
చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లిపాలు, ఏడో నెల నుంచి అదనపు పోషకాహారం తప్పనిసరిగా అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగాజలం తెలిపారు. శుక్రవారం సత్తుపల్లి మండలం నారాయణపురం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. పోషకాహార పదార్ధాలను ప్రదర్శించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించి ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, టీచర్స్ శేషగిరి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி