అంబేద్కర్ నగర్లో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

81பார்த்தது
తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ఇళ్లు జలమయమయ్యాయి. ఏటా ఇదే పరిస్థితి ఉందని, అసలే విషజ్వరాలతో వణికిపోతున్న ప్రజానీకం ఇప్పుడు వరదల కారణంగా బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నామని వాపోతున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరకుండా తక్షణమే సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు తమకు శాశ్వత పరిష్కారం చూపాలని అంబేద్కర్ నగర్ వాసులు ప్రభుత్వాన్ని ఆదివారం కోరారు.

தொடர்புடைய செய்தி