ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

75பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ విధులు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కూసుమంచి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్, విధులకు వైద్యులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி