అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్లరేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం, సదాశివపురం, పాతకొత్తూరు, నాచేపల్లి గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక పనుల నిర్వహణకు సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు.