బోనకల్ మండలంలో సోషల్ వెల్ఫేర్, బీసీ గురుకుల పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్, గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ప్లకార్డులతో టీచర్స్ నిరసన చేపట్టారు. ఉపాధ్యాయ సమస్యలు, మెస్ ఛార్జీల పెంపు, పక్కా భవనాల నిర్మాణం, వేతనాలు చెల్లింపు, రాత్రి కేర్ టేకర్స్ నియామకం వంటి సమస్యలపై డిమాండ్లు చేయడం జరిగింది. సమస్యలు పరిష్కరించకపోతే 28న మహాధర్నా చేస్తామని హెచ్చరించారు.