వరదలో మృతి చెందిన మహిళ కుటుంబానికి చెక్కు అందజేత

54பார்த்தது
వరదలో మృతి చెందిన మహిళ కుటుంబానికి చెక్కు అందజేత
ఇటీవల భారీ వ‌ర‌ద‌ ఉధృతికి మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలోని దెందుకూరు గ్రామానికి చెందిన న‌న్నెబోయిన ప‌ద్మావ‌తి అనే మ‌హిళ ప్ర‌మాద‌వ‌శాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ క్రమంలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారి స్వగృహానికి వెళ్లి పద్మావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతిరాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 5 ల‌క్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందించారు.

தொடர்புடைய செய்தி