ఇటీవల భారీ వరద ఉధృతికి మధిర నియోజకవర్గంలోని దెందుకూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన పద్మావతి అనే మహిళ ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ క్రమంలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారి స్వగృహానికి వెళ్లి పద్మావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతిరాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును అందించారు.