వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాల పరిధిలో పలు గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెనలు, చెక్ డ్యాంల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ విప్ పరిశీలించారు.