రామగుండం 33వ డివిజన్ ను దత్తత తీసుకోవాలి..

73பார்த்தது
రామగుండం 33వ డివిజన్ ను దత్తత తీసుకోవాలి..
సింగరేణి సంస్థ ఓసిపి-5 ప్రభావిత 33వ డివిజన్ ను సింగరేణి యాజమాన్యం దత్తత తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు, నాయకులు కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ఆర్జీ-1 జిఎం లలిత్ కుమార్ లకు వినతి పత్రం అందజేశారు. డివిజన్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని, నూతన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని, సెక్టర్-2 కమ్యూనిటీ హాల్ మరమత్తులు, నూతన పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி