జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.