రాజారాంపల్లిలో కొమరం భీం జయంతి ఉత్సవం

73பார்த்தது
ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి గ్రామ ఆదివాసి పాండవుల వాడలో మంగళవారం కొమురం భీం 123 జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు చేసిన పోరాట స్ఫూర్తికి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఆదివాసి రాజారాంపల్లి గ్రామ నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி