
ధర్మపురి: ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
ధర్మపురి మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలించారు. వైద్య సేవలు మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓపిలను చూస్తున్నారు అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధు సుధన్, ఎమ్మార్వో కృష్ణ చైతన్య పాల్గొన్నారు.