4G, 5G సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ BSNL పోటీపడలేక పోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో BSNL నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పాటించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి సింధియాకు BSNL ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది.