రాజస్థాన్ రాజధాని జైపూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగిం
ది. ఇటీవల ఓ యువకుడు (21) తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి
పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతనికి ఆపరేషన్ చేశారు. తన పొట్టలోని వస్తువులు చూసి వైద్యులు షాక్ అయ్యారు. పొట్టలోంచి గోళ్లు, సూదులు, తాళం చెవులు, గింజలు, బోల్టులు ఇలా అన్ని లోహపు వస్తువులు బయటపడడంతో అవాక్కయ్యారు.