ఐపీఎల్-2024 తుది పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు చిన్న ఓదార్పు లభించింది. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు బెస్ట్ పిచ్, బెస్ట్ గ్రౌండ్గా అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డును అందుకుంది. అలాగే రూ.50 లక్షల ప్రైజ్మనీ కూడా దక్కింది.