తెలంగాణలో వడదెబ్బకు గురై శనివారం ఆరుగురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గుర్తుతెలియని వ్యక్తి(35) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. హనుమకొండ జిల్లా పెంచికల్పేట్కు చెందిన తొగరు ఐలయ్య(85), కరీంనగర్ గంజ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(50) మృతిచెందారు. గంగాధర మండలం గర్శకుర్తిలో చిందం అన్నవ్వ(86), మంచిర్యాల జిల్లా భీమారంలో అరెకిల్ల సంపత్(45), ములుగు జిల్లా కమలాపురంలో కోరుకొండ ఆనంద్(65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.