ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. బిసంకటక్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండులో ఆగిఉన్న బస్సుల్లో మంటలు చెలరేగాయని చెప్పారు. బస్సుల్లో కూర్చున్న ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సకాలంలో మంటలను అదుపు చేశామని తెలిపారు.