హైదరాబాద్లో కొండాపూర్ సమీపంలోని ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ బిగ్ బాస్కెట్ గోదాంలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గోదాంలో గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా చీజ్, పనీర్, ఐస్క్రీమ్లు, ఆల్మండ్లు కనుగోన్నారు. అంతేగాక ఈ గోదాం ఫుడ్, నాన్ ఫుడ్ వస్తువులను కలిపి ఒకే చోట నిల్వ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు.. గోదాం నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.