ద్వీప దేశం మాల్దీవులతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని, ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే పరిశీలించి, పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు.