హైడ్రా పని తీరుపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల మాత్రమే నిర్మాణాలను తొలగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇదివరకే నిర్మించిన ఇళ్లను కూడా కూల్చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించాలని ఎంపీ అన్నారు.