బేగంపేట్ నుంచి బల్కంపేట్ వరకు రాకపోకలకు అంతరాయం

85பார்த்தது
నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమాయమయ్యాయి. కాలనీలు, ఫ్లై ఓవర్లు అనే తేడా లేకుండా వరద పూర్తిగా నగరాన్ని ముంచెత్తింది. బేగంపేట్ నుంచి బల్కంపేట్ కు వెళ్లే దారిలో ఆర్యూబీ బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోయింది. ఆర్యూబీ మొత్తం వరద నీటిలో మునిగిపోవడం వల్ల బేగంపేట్ నుంచి బల్కంపేట్ వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி