నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. సుచిత్ర, జీడిమెట్ల సుభాష్ నగర్, కత్బుల్లాపూర్, కొంపల్లి ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది. వర్షపు నీటితో కాలనీ రోడ్లు జలమయం అయ్యాయి. దీనితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.