దొంగతనం కేసులో అక్కాచెల్లెళ్లు అరెస్ట్

79பார்த்தது
వెండి పూజా సామగ్రిని దొంగిలించిన అక్కాచెల్లెళ్లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చిక్కడపల్లి ఏసీపి ఎల్. రమేశ్ కుమార్ తెలిపారు. బాగ్లింగంపల్లికి చెందిన ప్రతాప్ ఓంకారేశ్వర్ ఇంట్లో వెండి పూజా సామగ్రి పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయనగర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు ఉమ (45), స్వప్న దొంగిలించినట్లు గుర్తించి పూజా సామగ్రిని రికవరీ చేశారు.

தொடர்புடைய செய்தி