హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మియాపూర్లోని ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జయప్రకాశ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నారు.