వివిధ ఏజెన్సీలు శాంపిల్ మెథడ్స్, స్టాటిస్టికల్ ఎనాలసిస్లను కలిపి ఎగ్జిట్ పోల్స్ని లెక్కిస్తారు. తొలుత ఈ ఏజెన్సీలు ఏరియాల వారీగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో ఓటర్ని ఎవరికి ఓటు వేశారు? ఎక్కడ నివసిస్తారు? వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు. వారిచ్చే సమాధానాలను రికార్డ్ చేసుకుంటారు. నిపుణులు ఈ డేటాని పరిశీలించి, ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేసేందుకు విశ్లేషిస్తారు. అయితే, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలనేవి ఎప్పటికీ సరైనవి కావు.