మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా ఫతేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 22న షాకింగ్ ఘటన జరిగింది. మహేంద్ర సింగ్ అనే వ్యక్తిని బంధువులు కిడ్నాప్ చేశారు. రాజస్థాన్కు తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో తిప్పారు. అతడిని కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు. గుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేశారు. కుటుంబ కలహాల కారణంగా వారిలా చేశారు. బాధితుడి కుటుంబాన్ని రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.