నేడు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 12 జిల్లాలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 52మంది అభ్యర్థులు తలపడుతుండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు.