విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలి

79பார்த்தது
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలి
విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతి రోజు పాఠశాలకు రావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా 3వ తరగతి విద్యార్థులచే తెలుగు వాచకం చదివించారు. విద్యార్థుల లెసన్ ప్లాన్ లను పరిశీలించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్, విద్యార్థుల హాజరు శాతాన్ని చూశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

தொடர்புடைய செய்தி