వైభవంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు

61பார்த்தது
ఉట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో త్రిశక్తి పీఠాధిపతి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ ఆధ్వర్యంలో గురువారం దుర్గామాత విగ్రహా ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి గ్రామ పురవీధుల గుండా భాజా భజంత్రీలు, బైండ్ల వారి నృత్యాలతో, మాలధారణ భక్తుల భజనలతో అంబాత్రయ క్షేత్రానికి తీసుకెళ్లారు. అనంతరం ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி