పాఠశాలలో అగ్నిప్రమాదం.. 1400 మంది విద్యార్థినులు సేఫ్

62பார்த்தது
పాఠశాలలో అగ్నిప్రమాదం.. 1400 మంది విద్యార్థినులు సేఫ్
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తంక్వా ప్రావిన్స్‌లో ఓ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే 1400 మంది విద్యార్థినులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హరిపూర్ జిల్లా సిరికోట్ గ్రామంలోని ప్రభుత్వ బాలికోన్నత ప్రాథమిక పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పాఠశాల పూర్తిగా దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி