ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లోని గోండ్వారా ప్రాంతంలో ఉన్న మెట్రెస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మరణించారు. ప్రమాద సమయంలో ఏడుగురు కార్మికులు ఉండగా ఐదుగురు ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. మృతులు సరోరా గ్రామానికి చెందిన యమునా, రామేశ్వరిగా గుర్తించారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.