యూపీ ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. ప్లాట్ఫారంపై ప్రియుడితో ఓ మహిళ గొడవ పడింది. ఈ క్రమంలో మహిళ అకస్మాత్తుగా లేచి రైల్వే ట్రాక్పైకి దూకింది. అదే సమయంలో కేరళ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చింది. ఆ మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.