లోక్సభ ఎన్నికలకు సంబంధించి తుది విడత పోలింగ్ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. తుది ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.