బంగ్లాదేశ్లో బుధవారం భూకంపం సంభవించింది. రాజధాని ఢాకా, పరిసర ప్రాంతాల్లో భూమి కంపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 5.5గా నమోదైనట్లు పేర్కొన్నారు. ఢాకాతో పాటు చటోగ్రామ్, సిల్హెట్ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఢాకాకు తూర్పున 439 కిలోమీటర్ల దూరంలోని మయన్మార్లో ఉంది. అయితే భూకంపం వల్ల ఏర్పడిన నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.