ఐపీఎల్ 2024 ట్రోఫీని KKR గెలుచుకోవడంలో జట్టు మెంటార్ గంభీర్ది కీలక పాత్ర అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే SRHతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. టీమిండియా ప్రధాన కోచ్ పదవి చేపట్టాలని గంభీర్ను ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేసిందనే ప్రచారం సాగుతోంది.