మని, మల్లాసురులు అనే రాక్షసుల వికృత చేష్టలు భరించలేక ఋషులు మొదట బ్రహ్మదేవుని, అక్కడ నుంచి వైకుంఠం చేరి విష్ణుమూర్తి శరణు వేడుకోగా మని మల్లసురులు శివుని భక్తులు కావున పరమేశ్వరుడిని శరణు కోరమని విష్ణువు చెబుతారు. వారు రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలని శివుని వేడుకోగా.. రాక్షస సంహారం కోసం శివపార్వతులు దేవరగట్టులో కూర్మ అవతారంలో కొండ గుహలో మాళవి మల్లేశ్వరులుగా స్వయంభువులై వెలుస్తారు.